గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు. 2014ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు అన్యాయం చేయడంతో ఈసారి గట్టిగా బుద్ధి చెప్పారు. అప్పట్లో విదేశీ ప్రయాణాలు చేస్తూ ప్రజలు డబ్బు మొత్తం వృధా చేసాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పిన బాబు ఇంకా మారలేదనే చెప్పాలి. ఎందుకంటే వైద్య పరీక్షల కోసం బాబుగారు అమెరికా పోతున్నారట. దుబాయ్ నుంచి అమెరికా పారిపోతూ పట్టుబడ్డ గరుడ పురాణం శివాజీ చంద్రబాబు కలిసి కమ్మని కుట్ర ఏదో చేద్దామనుకొన్నారా? అసలు అమరావతిలో వైద్యం లేకే అమెరికా వెళుతున్నాడా?
అలా అయితే మరి కనీస వైద్య పరీక్షలు లేని ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని అప్పట్లో చంద్రబాబు చెప్పిన మాటలు అన్నీ వట్టివేనా? విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై కత్తి దాడి జరిగితే ఏపీలో వైద్యం లేదా? హైదరాబాద్ ఎందుకని చెప్పిన బాబు అండ్ కో ఇప్పుడు అమెరికా ఎందుకో? అధికారంలో ఉన్నప్పుడు యనమల పుచ్చిన పంటి కోసం సింగపూర్ లో ట్రీట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికే ED బాబు సన్నిహితులైన బొల్లి నేని గాంధీ చౌదరి , సానా సతీష్ లను అరెస్ట్ చేసింది. ఇన్నాళ్ళూ బాబు ఇక్కడ దోచుకొని అక్కడ దాచుకున్న సొమ్ము సేఫ్ గా ఉందో లేదో చూసుకోడానికి వెలుతున్నడా?