మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని వార్త వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఘోర పరాజయం చవిచూశారు.అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. ప్రస్తుతం అతనిపై చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. జగన్ మీద కేసులు పెట్టి ఆ తరువాత ఊరూరా తిరిగి భగవద్గీత ప్రవచనాలు చెప్పినందుకు మొత్తం 500 కోట్లు పైనే ముట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అరెస్టైన సానా సతీష్ అకౌంట్ నుండి కేడీ లక్ష్మీనారాయణకి 500 కోట్లు విలువైన ఆస్తులు ట్రాన్సఫర్ అయినట్లు సీబీఐ గుర్తుంచింది. ఈ కుంభకోణంలో టీడీపీ మాజీ మంత్రి / మాజీ సీబీఐ ఆఫీసర్ విజయరామారావు కూడా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ప్రస్తుతం వీళ్ళ టార్గెట్ జేడీనే. దీంతో ఎక్కడికి వెళ్ళినా వదలరు కాబట్టి పుష్పం పార్టీలో చేరిపోతే ఇంక ఎలాంటి వత్తిడి ఉండదు. అక్కడైతే నీ దేశభక్తి ప్రవచనాలకి మంచి డిమాండ్ ఉంటుంది . అన్నీ కలిసొస్తే కేంద్రంలో మంత్రివి కూడా కావొచ్చు అని నెటీజన్లు ఫైర్ అవుతున్నారు.