సుందిళ్ల పంప్హౌస్ మొదటి మెషీన్ వెట్రన్ ఎంఇఐఎల్ విజయంతంగా ప్రారంభించింది. మొదటి మెషీన్ నుంచి ఈరోజు (31-07-2019) సాయంత్రం నీటిని పంపింగ్ చేశారు. ఎల్లంపల్లిలో నీటి మట్టాన్ని చూసి ఆ తర్వాత నీటి పంపింగ్ కొనసాగిస్తారు. ఈ రాత్రికి సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని పంప్చేయాలి. అయితే ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయానికి కడెం ప్రాజెక్ట్ నుంచి వరద నీరు వచ్చేదాన్ని బట్టి మెషీన్లను పంప్ చేయాలా? లేదా అనేది నిర్ణయిస్తారు.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఎల్లంపల్లికి వరద నీరు చేరుతుండడంతో ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం పంప్హౌస్లోని మెషీన్లను ప్రభుత్వం సూచన మేరకు నిలుపుదల చేశారు.మేడిగడ్డలో పంప్హౌస్లోని ఏడో మిషన్ వెట్ రన్ను ఈ రోజు రాత్రికి నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎంఇఈఐఎల్ పూర్తి చేసింది.ఈరోజు (31-07-2019) అన్నారం పంప్హౌస్లోని ఐదో పంప్ వెట్రన్ను కూడా విజయవంతంగా పూర్తిచేశారు. అవసరాన్ని బట్టి మేడిగడ్డ, అన్నారం పంప్హౌస్లోని మెషీన్ల నుంచి నీటిని సుందిళ్లకు పంపింగ్ చేయనున్నారు.
సుందిళ్ళ(గోలివాడ) పంప్ హౌస్ మొదటి పంప్ వెట్ రన్ విజయవంతం.
Posted by Dharuvu on Wednesday, 31 July 2019