Home / ANDHRAPRADESH / జగన్ దెబ్బకు టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందా..?

జగన్ దెబ్బకు టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందా..?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయంలో సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంలో టీడీపీ నాయకులు, మంత్రులు కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తామని అన్నారు. మీలాగా కుల, వర్గ బలహీనతలు సీఎం జగన్ గారికి లేవు. మీరే చూస్తారుగా తొందరెందుకు? అని గట్టిగా సమాధానం చెప్పాడు. అయితే కాంట్రాక్టుల విషయంలో అవినీతి జరుగుతుందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జగన్ రివర్స్‌ టెండరింగ్‌ పద్దతికి పూనుకున్నారు.ఈ రివర్స్‌ టెండరింగ్‌కు దీనికి సంబంధిచిన శాఖ వారు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో ప్రజాధనం మిగులుతుందని అందరు భావిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat