ఏపీ సీఎం హోదాలో వైఎస్ జగన్ మొట్టమొదటి విదేశీ పర్యటనకు వెళ్లారు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జగన్ తొలి విదేశీ పర్యటనకు వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జగన్ కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పొందారు. ఆయన విదేశీ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించడం పట్ల జగన్ విదేశాలకు వెళ్లారు. వైఎస్ కుటుంబం మొదటినుంచీ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండడం తెలిసిందే.. ఈ క్రమంలో ఆయన క్రీస్తు జన్మస్థలం జెరూసలెంకు కుటుంబంతో సహా వెళ్లారు. అలాగే తన చిన్న కుమార్తెను యూనివర్శిటీలో చేర్చించేందుకు అమెరికా వెళ్తున్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆగస్టు 5న జెరూసలేం పర్యటన ముగించుకుని జగన్ తిరిగి అమరావతికి రానున్నారు.
అలాగే ఆగస్టు 15న విశాఖలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అయితే జగన్ పర్యటనలు సర్వత్రా తాను ఏయే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎందుకు వెళ్తున్నానో వెల్లడిస్తూ ముందుకు వెళ్తుండగా చంద్రబాబు మాత్రం గతంలో అధికారంలో ఉన్నపుడు రహస్య పర్యటనలు చేస్తుండేవారు. రకరకాల వ్యక్తులతో మంతనాలు సాగిస్తున్న వార్తలు గుప్పుమనేవి. ఆయనపై అనేక విమర్శలువ వినిపించడానికి కూడా విదేశీ పర్యటనలే కారణం.