Home / ANDHRAPRADESH / బుుషికేష్‌లో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పర్యటన..!

బుుషికేష్‌లో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పర్యటన..!

పవిత్ర పుణ్యక్షేత్రం బుుషికేశ్‌లో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పర్యటించారు.  విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి బాలస్వామి వారు బుుషికేష్‌లో చాతుర్మాస్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 14 వరకు స్వామిజీలు బుుషికేష్‌లో తపోదీక్ష అవలంబిస్తారు. తాజాగా  టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు   బుుషికేష్‌ శ్రీ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. ఈ రోజు బుుషికేష్‌కు వెళ్లిన వైవి సుబ్బారెడ్డి దంపతులు స్వామిజీతో కలిసి పవిత్ర గంగా తీరాన పుణ్యస్నానం ఆచరించారు. తదనంతరం శారదాపీఠం ఆశ్రమంలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో  మెరుగైన సేవల కోసం సూచనలు, సలహాలు అందించాలని ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి స్వామిజీని కోరారు.  వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ….శారదా పీఠాధిపతి చేపట్టే చాతుర్మాస్య దీక్షలో పాల్గొనడం తనకు సంతోషాన్నిచ్చింది అని చెప్పారు.  హిందూ ధర్మ పరిరక్షణకు శారదా పీఠం చేపడుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు అభినందనీయం అని ప్రశంసలు కురిపించారు. టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి బుుషికేష్ పర్యటనలో దరువు ఎండీ సిహెచ్ కరణ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat