పోలవరం…ఏపీకి వరం అయిందో కాదో తెలియదు కానీ..గత ఐదేళ్లలో బాబుగారి పాలిట, ఆయన బినామీ కాంట్రాక్టర్ల పాలిట వరంగా మారింది. గత ఐదేళ్లు ప్రతి సోమవారం పోలవరంగా ప్రకటించి…2018 కల్లా పోలవరం నీళ్లు పారిస్తా అని చెప్పి ఊరించాడు. అసలు వాస్తవం చూస్తే ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు ఇంకా తొలి దశలో ఉన్నాయి. బాబుగారు కట్టించిన కాఫర్ డ్యామ్ కాస్త వరదలకు గండిపడి…బాబుగారి హయాంలో జరిగిన పోలవరం పనులు ఎంత నాసిరకంగా ఉన్నాయో ఎత్తి చూపింది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అడ్డగోలుగా ఎస్టిమేషన్లు పెంచేసారు..బాబుగారు. అందుకు ప్రతిఫలంగా భారీగా బాబుగారికి ముడుపులు అందాయని అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతో పాటు, ఉండవల్లి లాంటి నాయకులు ఆరోపణలు గుప్పించారు. తాజాగా వైయస్ జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై నిపుణుల కమిటీని నియమించింది. పోలవరంలో 3,128 .31 కోట్లు నవయుగ కాంట్రాక్టు వల్ల దోపిడీ జరిగింది అని నిపుణల కమిటీ జులై 24,2019 న నివేదిక ఇచ్చింది (పోలవరం హెడ్ వర్క్స్ లోనే 1559 .65 కోట్ల దోపిడీ జరిగింది )
ఇక పోలవరం పనుల్లో అంతులేని దోపిడీ జరిగింది అని సెప్టెంబర్ 19 , 2018 న అని కాగ్ (కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ) రిపోర్ట్ ఇచ్చింది.పోలవరంను ఏటీఎం లాగా బాబు వాడుకున్నాడు అని ప్రధాని మోడీ ఎన్నికల సభల్లో కూడా ఆరోపించారు. పోలవరం జల విద్యుత్ పనులను 5 శాతము (4 .83 శాతం)ఎక్కువ కోట్ చేసిన రామోజీ వియ్యంకుడు నవయుగ చౌదరికి డిసెంబర్ 30 , 2017 న రూ. 3 ,220 .2 కోట్ల కు టెండర్ లు పిలవకుండా ( 5 లక్షలు పనుల వరకే నామినేషన్, దాటితే టెండర్ లు పిలవాలి) నామినేషన్ పద్దతిలో ఇచ్చింది గత బాబు ప్రభుత్వం .2013 లో పోలవరం హెడ్ వర్క్స్ పనులను ఆనాటి కాంగ్రెస్ ఎంపీ రాయపాటి చౌదరి కి చెందిన ట్రాన్సాకాయ్ దక్కించుకొంటే రాయపాటికి ఆ వర్క్ చేసే కెపాసిటీ లేదు అని బాబు విమర్శించాడు , తరువాత 2014 లో రాయపాటి టీడీపీ ఎంపీగా పోటీ చేసేసరికి పోలవరం అంచనాలను పెంచేశాడు బాబు.
జులై -అక్టోబర్ మధ్య గోదావరికి వరద వస్తుంది. కాబట్టి పోలవరంలో ఎలాంటి పనులు జరగవు కాబట్టి ఈ మూడు నాలుగు నెలల కాలం లో ఓపెన్ టెండర్ ద్వారా పారదర్శకంగా సమర్థులైన కాంట్రాక్టర్లను ఎన్నుకోవడంలో సీఎం జగన్ చేసిన తప్పేముంది…ఎవరైనా తక్కువ డబ్బుతో పోలవరం పనులు చేయడానికి ముందుకు వస్తే ఆ మేరకు ప్రభుత్వ ఖజానాకు లాభమే కదా…జగన్ కొత్తగా ఓపెన్ టెండర్ లు పిలిచి ఎవరు తక్కువకు చేస్తే వారికి ఇస్తాడు. ఈ టెండర్ నియమ నిబంధలను రాష్ట్ర హైకోర్ట్ సూచించిన ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలోని ఇరిగేషన్ నిపుణుల బృందం పరిశీలించి ఓకే చేశాకే నిబంధనలు రూపొందిస్తారు. ఈ ఓపెన్ టెండర్ లో ఎవరైనా పాల్గొనవచ్చు నవయుగ తో సహా కాబట్టి ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుంది. సీఎం జగన్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల్లో ఒక్క పైసా అవినీతి జరిగినా..రివర్స్ టెండరింగ్కు వెళతామని చెప్పాడు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత బాబుగారి హయాంలో ప్రాజెక్టుల్లో 3 వేల కోట్లు అవినీతి జరిగితే…చూస్తూ ఊరుకుంటాడా..అందుకే నవయుగను తప్పించి…మళ్లీ రివర్స్ టెండరింగ్ పిలిచాడు…అది రిటైర్డ్ జడ్జీ ఆమోదించిన తర్వాతే టెండర్ను తక్కువ కోట్ చేసిన సంస్థలకు అప్పగిస్తారు. ఇంత పారదర్శకంగా జరుగుతుంటే…మా నిప్పు బాబుగారి అవినీతిని బయటకు తీస్తారా అంటూ పోలవరం ఆగిపోయిందంటూ ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు చేస్తోంది. జగన్ ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పని చేస్తుంటే అభినందించాల్సింది పోయి ఇలా విష ప్రచారాలు చేయడం ఎల్లోమీడియా దిగజారుడుతనానికి నిదర్శనం. టీడీపీ అవినీతి పాలన తట్టుకోలేక ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బాబుగారికి బుద్ధి రాలేదు…ఎల్లోమీడియాకు సిగ్గురాలేదు..అయినా వారు మారుతారు అనుకోవడం భ్రమ. జగన్ ప్రభుత్వం ఎంత మంచి చేసినా…ఎల్లోమీడియాకు చెడుగానే కనిపిస్తుంది…విషం చిమ్ముతూనే ఉంటుంది. బాబు మారడు..ఈ ఎల్లో మీడియా ఛానళ్లు మారవు…అంతేగా మరి.