Home / SLIDER / కాళేశ్వరం ఫలాలు ముందుగా ఆ జిల్లాకే..!

కాళేశ్వరం ఫలాలు ముందుగా ఆ జిల్లాకే..!

స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఉద్ఘాటించారు.

జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపానికి చేరుకుని, టీఆర్‌ఎస్ పట్టణ బూత్‌కమిటీ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ” మధ్యమానేరు ప్రాజెక్టు సమైక్యపాలనలో నత్తనడకన సాగిందని కేటీఆర్ విమర్శించారు.

దానిని రీడిజైన్‌చేసి అదనంగా రూ.350 కోట్లు కేటాయించి, సకాలంలో పూర్తిచేశామని చెప్పారు. నిర్వాసితుల సమస్యలను ప్రభు త్వం 99% పరిష్కరించిందని చెప్పారు. సమస్యల పేరు చెప్పి ధర్నాలు, ఆందోళనలు చేస్తూ నిర్వాసితులపై విపక్షాలు కపటప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు. వేములవాడలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నదన్నారు.కాళేశ్వరం ఫలాలు ముందుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే దక్కనున్నాయని ఆయన అన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat