ఎంతో ప్రజాదరణ పొందిన విజయ పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
గురువారం సచివాలయంలో విజయ ఉత్పత్తుల విక్రయానికి వినియోగించనున్న ఎలక్ట్రిక్ వాహనాన్ని పశుసంవర్ధక కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, విజయ డైరీ MD శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి బ్యాటరీ ఛార్జ్ ద్వారా నడిచే ఈ వాహనం 6 నుండి 8 గంటల పాటు ఛార్జింగ్ పెడితే 90 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని అధికారులు మంత్రికి వివరించారు.
మొదటి దశలో 100 వాహనాలను ghmc పరిధిలో, పాత10 జిల్లాలలో ఒక్కో జిల్లాకు మరో 100 వాహనాల ద్వారా విజయ ఉత్పత్తుల విక్రయాలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా నూతన ఔట్ లెట్ లను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Tags kcr ktr slider talasani sai kiran yadav talasani srinivas yadav telanganacm telanganacmo trs vijay milk