నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది. గతంలో దరువు నిర్వహించిన సర్వేలు వందకు వంద శాతం నిజమయ్యాయి. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు గెల్చుకుంటుందని ప్రకటించిన దరువు సర్వే నిజమైంది. 2018 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 90 సీట్లు గెల్చుకుంటుందని దరువు సర్వే ఫలితాలను ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ 90 సీట్లు గెల్చుకుని చరిత్ర తిరగరాసింది. ఇక 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వస్తాయని చెప్పిన ఏకైక సర్వే…దరువు. 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్పింది దరువు. సర్వేల్లో ప్రజలనాడీ పట్టుకోవడంలో దరువుది అందె వేసిన చేయి. ప్రామాణికత, కచ్చితత్వం, పారదర్శకత పాటించడం దరువుకే సొంతం. అయితే ఏపీలో వైయస్ జగన్ 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు సమగ్ర సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడం జరిగింది. మహిళలు, వృద్ధులు, యువత, ఉద్యోగులు, రైతులు..ఇలా అందరినీ దరువు పలకరించింది. పట్టణాలు, అర్బన్ ప్రాంతాలతోపాటు రూరల్ గ్రామాల్లోనూ దరువు సర్వే నిర్వహించింది. మొత్తం 50వేలమందిని ఈ సర్వేలో భాగస్వాములను చేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వివిధ ప్రాజెక్టులు, పోలవరం విషయంలో వేసిన రివర్స్ టెండరింగ్ పిలిచారు. అయితే దీనిపై ప్రజల్లో ఎటువంటి చర్చ జరుగుతుందనే అంశంపై దరువు ప్రజాభిప్రాయం తీసుకోవడం జరిగింది. అయితే కాంట్రాక్టుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని 70% ప్రజలు సమర్ధించగా, 27% మంది వ్యతిరేకించారు. చివరిగా 3% మంది మాత్రమే చెప్పలేం అని సమాధానమిచ్చారు. అయితే గత ఐదేళ్ల టీడీపీ పాలనలో పోలవరం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టుల్లో భారీఎత్తున జరిగిందని, టీడీపీ ప్రభుత్వం అడ్డదారుల్లో కాంట్రాక్టులు కట్టబెట్టిందనేది చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు సహా ఇతర అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులపైనా జగన్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ నిర్ణయాన్ని ప్రజలు ముక్త కంఠంతో సమర్ధిస్తున్నారు. తాము పన్నుల రూపాయిలో కట్టిన సొమ్ము ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయకుండా కడుపులు నింపిన టీడీపీ నేతలనుండి కక్కించాలని కోరుతున్నారు.