Home / ANDHRAPRADESH / ఇది చూస్తే …జగన్ బుగ్గనను ఆర్ధికమంత్రిగా నియమించింది ఇందుకే

ఇది చూస్తే …జగన్ బుగ్గనను ఆర్ధికమంత్రిగా నియమించింది ఇందుకే

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఫైరయ్యారు. పింఛన్ల పంపిణీపై టీడీపీనేతలు మీడియాలో, సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బుగ్గన ట్విట్టర్‌ వేదికగా ఖండించారు. మీలా మాకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం చేతకాదని బుగ్గన అన్నారు. బుగ్గన చేసిన ట్వీట్‌ యధాతధంగా.. చంద్రబాబు గారూ ప్రతీనెల మాదిరి ఈనెల కూడా 1వ తేదీ నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటివరకు 49,93,689 మందికి (93.5%) పంపిణీ జరిగింది. మీ మాదిరిగా మాకు అబద్ధాలుచెప్పడం మోసంచేయడం చేతకాదు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వచ్చినా పింఛన్ల పంపిణీ శాతం మీపాలన కంటే మెరుగ్గానే చేశామనడానికి గత 7నెలల పంపిణీ సరళిని చూడండి మీకే తెలుస్తుంది. 1 వ తేదీనే మొత్తం పింఛన్లు పంపిణీ పూర్తి చేయడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆవిషయం మీకు కూడా తెలుసంటూ చురకలేసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat