Home / ANDHRAPRADESH / కొత్త కొత్త హంగులతో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం..జగన్ రిబ్బన్ కట్ ఎవరితో చెయించాడో తెలుసా

కొత్త కొత్త హంగులతో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం..జగన్ రిబ్బన్ కట్ ఎవరితో చెయించాడో తెలుసా

తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం అయ్యింది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ పార్టీ నేతలకు అభివాదం చేస్తూ వైయస్సార్ విగ్రహానికి నివాళి అర్పించి, ఆ తరువాత పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం రిబ్బన్ కట్ చేయటానికి చేరుకున్నారు. అక్కడే ఎంపీ సురేష్..ఆమంచి క్రిష్ట మోహన్ సైతం అక్కడే ఉన్నారు. అంతే..వెంటనే జగన్ తన చేతిలో ఉన్న కత్తెర ను ఆమంచికి ఇచ్చి రిబ్బన్ కట్ చేయాలని సూచించారు. ఆమంచి క్రిష్ట మోహన్ అధినేతగా మీరు చేయాల్సింది..నేను కాదు అంటూ వారించారు. జగన్ మాత్రం వినలేదు. తానే స్వయంగా ఆమంచి చేతులను పట్టుకొని..తన చేతులు కలిపి రిబ్బన్ కట్ చేసారు. అదే సమయంలో ఎంపీ సురేష్ సైతం చేయి కలిపారు.


అయితే ఈ కార్యాలయంలో ఐటీవింగ్, అనుబంధ విభాగాలు, ముఖ్యనేతల ఛాంబర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మోనిటరింగ్ చేసేందుకు వీలుగా పార్టీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మూడు అంతస్తుల్లో పార్టీ కార్యాలయం నిర్మించారు. మొదటి ఫ్లోర్‌లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండవ ఫ్లోర్‌లో పార్టీ అనుబంధ విభాగాలు పనిచేయనున్నాయి. మూడవ ఫ్లోర్‌‌లో పార్టీ అధ్యక్షుడు జగన్‌కు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులకు ఛాంబర్లు ఏర్పాటు చేశారు. గతంలో హైదరాబాద్‌ లోటస్‌పాండ్ కేంద్రంగా జరిగిన పార్టీ కార్యకలాపాలు.. ఇక నుంచి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సైతం వారంలో ఒక రోజు ఇక్కడ పార్టీ నేతలకు అందుబాటులో ఉండనున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat