సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్ ఆవరణలో కంటి ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన జరిగింది. ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కంటి ఆస్పత్రి భవనానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…తెలంగాణలో సిరిసిల్లతో కలిపి ఏడు సెంటర్లు ఉన్నాయి. సామాజిక బాధ్యతతో ఎంతో మంది ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇతరులు కూడా స్పూర్తి పొంది మంచి పనులు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కంటి వెలుగు దేశంలో ఎక్కడా జరగలేదు. కంటి వెలుగు పథకంతో పేదలకు కంటి పరిక్షలు చేయించామని తెలిపారు.
TRS Working President and Sircilla MLA sri @KTRTRS participated in ground breaking ceremony of LV Prasad Eye Hospital in Sircilla today along with @Collector_RSL Krishna Bhaskar. pic.twitter.com/ieHPoJjg0V
— KTR News (@KTR_News) August 13, 2019