వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .. తనకు అనారోగ్యం చేసి .. ఫీవర్ వచ్చింది.. మందులు కొనాలి.అందుకు ముప్పై రూపాయలు కావాలని అడిగినందుకు ఏకంగా ఆమెకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఆమె భర్త. అత్యంత దారుణమైన ఈ సంఘటన యూపీలో హవూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
అసలు ఏమి జరిగిందంటే ఆమెకు సరిగ్గా మూడేండ్ల కిందటనే పెళ్ళి అయింది .అయితే అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు ఫీవర్ వచ్చింది. దీంతో ఆమె మందుల కోసం రూ. 30 ఇవ్వమని తన భర్తను అడిగింది. డబ్బులు లేవంటూ తనపై కోపం చేస్తూ తీవ్రంగా మందలించాడు.
ఆ తర్వాత త్రిపుల్ తలాక్ చెప్పి.. ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు మీడియాకు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.