మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయ్యింది. దర్శకుడు ఈ చిత్రానికి ‘అల.. వైకుంఠపురములో’ అనే టైటిల్ పెట్టాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలో చిన్న సన్నివేశాన్ని టీజర్ రూపంలో చూపించాడు డైరెక్టర్. ఈ టీజర్ లో బన్నీ, మురళీ శర్మ మధ్య చిన్న సన్నివేశం ఉంది. అందులో ‘ఏంట్రోయ్.. గ్యాప్ ఇచ్చావు?’ అని మురళీ శర్మ అడగగా.. ‘ఇవ్వలా.. వచ్చింది’ అని ఎటకారంగా సమాధానం చెప్పే తీరు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక చిత్రం టైటిల్ విషయానికి వస్తే ఇందులో చాలా పెద్ద సెంటిమెంట్ ఉందనే చెప్పాలి ఎందుకంటే.. డైరెక్టర్ త్రివిక్రమ్ ఎక్కువ తన సినిమా టైటిల్స్ ‘అ’ అక్షరంతోనే మొదలుపెట్టడం అది ఇప్పుడు ఒక సెంటిమెంట్ గా మారడం జరిగింది. చివరిగా తాను తీసిన సినిమాల్లో అన్ని ఈ అక్షరంతోనే ఉంటాయి. మరి ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో మరి వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే. అందులోను బన్నీకి ఇది 19వ చిత్రం.