సౌత్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డుల కార్యక్రమం సైమా మొదటిరోజే వైభవంగా జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిన్న ప్రారంభమైన ఈ ఈవెంట్ లో తెలుగు , కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది. ఇందులో భాగంగా ఆటా, పాటలతో పాటు కొన్ని ప్రదర్శనలు జరిగాయి. దీనికిగాను ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇక టాలీవుడ్లో అయితే రంగస్థలం సినిమా అత్యధిక అవార్డులు అందుకుని సత్తా చాటింది. అవార్డుల వివరాల్లోకి వెళ్తే..
ఉత్తమ చిత్రం : మహానటి
ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (రంగస్థలం)
ఉత్తమ నటుడు : రామ్చరణ్ (రంగస్థలం)
ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి)
ఉత్తమ విలన్ : శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ ( మహానటి)
ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)
ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్ దేవరకొండ( గీత గోవిందం)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్ (విజేత)
ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్ రాజ్పుత్ (ఆర్ఎక్స్ 100)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (ఎంత సక్కగున్నవవే – రంగస్థలం)
ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా – ఆర్ఎక్స్ 100)
ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ – రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్ భూపతి (ఆర్ఎక్స్ 100)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రంగస్థలం)
సామాజిక మాధ్యమాల్లో పాపులర్ స్టార్ : విజయ్ దేవరకొండ