Home / SLIDER / కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన నిర్ణయం

కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన నిర్ణయం

మాజీ ఎంపీ,కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కమిటీ చైర్మన్ అయిన విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారా..?. ఇప్పటికే పలు పార్టీలు మారిన ఆమె కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పనున్నారా..?. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైపు ఆమె చూస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎల్పీ పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని స్పీకర్ ను కూడా కోరారు. తాజాగా ఆ పార్టీకి చెందిన విజయశాంతి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి.

ఇప్పటికే బీజేపీలో చేరాలని ఇటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, అటు జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా విజయశాంతిని కోరినట్లు సమాచారం. అందుకే పార్టీ మారద్దు. బీజేపీలోకి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదు. మీరు బీజేపీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆమెను బుజ్జగించడానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కుసుమ్ కుమార్ కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. సో విజయశాంతి పార్టీ మారాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat