టాలీవుడ్ మన్మధుడు సీనియర్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా తెలుగు మా లో ప్రసారమవుతోన్న ఎంటర్ ట్రైనర్ ప్రోగ్రామ్ బిగ్ బాస్ 3. ప్రస్తుతం ఈ రీయాల్టీ షో అందర్నీ అకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3లో ప్రేమాయణం ఉండబోతుందా.?. గతంలో మాదిరిగా ఈ సీజన్లో కూడా లవ్ బర్డ్స్ ఉన్నారా..?. గత సీజన్లో సామ్రాట్ ,తేజస్వీ.. తనుష్ ,దీప్తి సునయనల మధ్య లవ్ ట్రాక్ నడిచినట్లు ఈ సీజన్లో కూడా నడుస్తుందా అంటే అవును అనే అంటున్నారు విశ్లేషకులు. అసలు విషయానికి వస్తే ఈ నెల పదిహేనో తారీఖున బిగ్ బాస్ హౌజ్లో రాఖీ పౌర్ణమి పండుగ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎపిసోడ్ ఇరవై ఏడులో రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు వాళ్ల వాళ్ల ఇంటి నుంచే వచ్చేలా చేశారు బిగ్ బాస్.బిగ్ బాస్ హౌజ్లో బజర్ మోగడంతో ఇంటి సభ్యులు స్టోర్ రూంలోకి వెళ్ళారు. అక్కడ ఉన్న గిఫ్ట్స్ చూసి అవాక్కయ్యారు. తమ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ రాఖీ పండుగని జరుపుకున్నారు.
హీరో వరుణ్ సందేశ్.. హిమజతో రాఖీ కట్టించుకోగా.. శివజ్యోతితో అలీ రాఖీ కట్టించుకున్నాడు. జ్యోతి నాకు దేవుడు ఇచ్చిన చెల్లి అని అలీ అనడంతో జ్యోతి కన్నీటి ధార ప్రవాహంలా సాగింది.అలీకి రాఖీ కట్టినందుకు ఆమెకి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఇక శ్రీముఖి తన తమ్ముడి స్థానంలో ఎవరిని ఊహించుకోలేనని చెబుతూ.. తనకి ఇష్టమైన బాబా భాస్కర్తో తన చేతికి రాఖీ కట్టించుకుంది. ఆ తర్వాత ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుంది. అయితే పునర్నవి వంతు రాగానే ఆమె హీరో వరుణ్ సందేశ్ ను చూస్తుంటే తనకు తన తమ్ముడు గుర్తోస్తున్నాడని చెప్పుకోచ్చింది.
దీంతో అతనికి రాఖీ కట్టాలని అనుకుంటున్నట్లు ఆమె పేర్కోన్నారు.దీని తర్వాత హౌజ్లో రాహుల్కి తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళందరికి పునర్నవీ రాఖీ శుభాకాంక్షలు చెప్పడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తన లైన్ క్లియర్ అయినట్టేనని రాహుల్ భావిస్తూ ఫుల్ ఖుష్ అయ్యాడు. రానున్న రోజులలో వీరి లవ్ ట్రాక్ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తునడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలని మరికొంతమంది వ్యాఖ్యానిస్తోన్నారు. అయిన సెలబ్రేటీలంటేనే పుఖార్లు కదా మరి..