కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు శ్రీ కేఎం పాండు గారి 74 వ జయంతి, విగ్రహావిష్కరణ మహోత్సవం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ బస్టాప్ పక్కన జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు హోం శాఖ మంత్రి మహమూద్అలీ గారు, తెలంగాణ రాష్ట్ర పశు సంరక్షణ, మత్స్య శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గారు, రాష్ట్ర మాజీ హోంమంత్రి మరియు ఎమ్మెల్సీ నాయిని నరసింహారెడ్డి గారు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు గారు, నవీన్ రావు గారు, ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు గారు, మాధవరం కృష్ణారావు గారు, అరికెపూడి గాంధీ గారు, కేపీ వివేకానంద్ గారు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు,