కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు తీపికబురు చెప్పింది. పెద్ద ఎత్తున ఉన్న నిరుద్యోగానికి చెక్ పెట్టేలా..కీలక నైపుణ్య శిక్షణను ప్రారంభించనుంది. తాజాగా కేంద్రం సమర్థ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. యువత, మహిళలకు శిక్షణనిచ్చి వారి సామర్థ్యాలు పెంపొందించి జౌళి రంగంలో ఉపాధి కల్పించేందుకు సమర్థ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 16 రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ 12 వేల మందికి, తెలంగాణ 1440 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ శిక్షణకు సంబంధించిన అంశాన్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వివరించారు. `కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘సమర్ధ్’ పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ లో 12,000 మంది యువతకు దుస్తుల తయారీ లో నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు శిక్షణ ఇస్తారు.` అని తెలుగులో ట్వీట్ చేశారు.
ఇదిలాఉండగా సమర్థ్ పధకం ద్వారా యువతకు దుస్తుల తయారీలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ ఇస్తుంది. 2017-20 మధ్యకాలంలో రూ.1,300 కోట్ల వ్యయంతో దేశంలో 10 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలన్నది సమర్థ్ పథకం లక్ష్యం. ఇలా శిక్షణ పొందిన యువతకు ఉపాధి కల్పించే మార్గాలను కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ తీసుకుంటుంది. ఈ పధకాన్ని దేశంలో 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘సమర్ధ్’ పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ లో 12,000 మంది యువతకు దుస్తుల తయారీ లో నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు శిక్షణ ఇస్తారు. pic.twitter.com/KiIOZuI1yQ
— Smriti Z Irani (@smritiirani) August 14, 2019