ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబెల్ స్టార్ అభిమానులకు నిన్న పండుగ జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న ఆగష్టు 18న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ నే అందుకు కారణం. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని భావించగా కొన్ని కారణాల వల్ల ఈ నెల 30కి ఫైనల్ చేసారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో బాహుబలి రూపకర్త రాజమౌళి ప్రభాస్ సినిమాపై ఏమీ మాట్లాడడంలేదని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి ఈ భారీ ఈవెంట్ కు హాజరయ్యారు జక్కన్న. అనంతరం మాట్లాడిన రాజమౌళి ప్రభాస్ ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. దీంతో ప్రభాస్ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నాడు. దీంతో నెగటివ్ రూమర్స్ తో స్క్రోల్ చేస్తున్నవారు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నారు.
Tags crying Movie prabhas pre release event Rajamouli ramoji film city sahoo sraddha kapor