Home / 18+ / అమితాబ్, రజినీ, యష్, పవన్, మోహన్ లాల్ వీళ్లంతా చిరంజీవి కోసం ఏం చేస్తున్నారో తెలుసా.?

అమితాబ్, రజినీ, యష్, పవన్, మోహన్ లాల్ వీళ్లంతా చిరంజీవి కోసం ఏం చేస్తున్నారో తెలుసా.?

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. సైరాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ భారీ ఎత్తున తెరకెక్కించాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి కోసం అన్ని భాషల అగ్ర నాయకులు రంగంలోకి దిగినట్టు అనిపిస్తోంది. ఏదో విధంగా చాలామంది ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ‘సైరా’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా గోసాయి వెంకన్న పాత్రలో నటిస్తున్నారు.

దీంతో ఈ సినిమాకు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. అలాగే సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా, తమన్నా నర్తకి పాత్రలో నటిస్తోంది. సైరాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో క్రేజ్ తీసుకొచ్చేందకు ఇప్పటికే ఆ భాషలకు చెందిన నటీనటుల్ని ఈ సినిమాలో తీసుకోగా ఇప్పటికే తెలుగు వెర్షన్ టీజర్‌కు పనవ్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. తమిళంలో ‘సైరా’ టీజర్‌ కు రజినీ కాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో యష్, హిందీలో అమితాబ్ ‌తో ఈసినిమా టీజర్‌కు వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారట.. మొత్తానికి సైరా చిరంజీవి కోసం ఆయా భాషల్లోని అగ్ర నటులంతా రంగంలోకి దిగుతున్నారు. దీంతో సినిమాకు మరింత హైప్ వస్తోంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat