Home / ANDHRAPRADESH / ఓటమితో తెలుగుదేశం శ్రేణులకు ఉన్న కాస్త మైండ్ కూడా పోయిందా.?

ఓటమితో తెలుగుదేశం శ్రేణులకు ఉన్న కాస్త మైండ్ కూడా పోయిందా.?

తాజాగా ఏపీ సీఎం జగన్ డల్లాస్ లో పాల్గొన్న సభకి విశేష స్పందన లభించింది.. స్థానిక అమెరికన్ పోలీస్ అధికారుల అంచనా మేరకే దాదాపుగా 9 వేల వరకూ హాజరైనట్లు సమాచారం.. పాదయాత్ర ద్వారా తను చూసిన కష్టాలకి ప్రతిరూపంగా రూపుదిద్దుకొన్న నవరత్నాలను జగన్ వివరించారు. జగన్ మాట్లాడిన ప్రతీ మాట ఎంతో నిజాయితీగా గుండె లోతుల్లోనుండి వచ్చిందని ప్రవాసాంధ్రులు మంత్ర ముగ్దులయ్యారు. అయితే జగన్ సభను అడ్డుకునేందుకు టీడీపీ ఎన్నారైలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.. సభ జరుగుతున్న డౌన్ టౌన్ లో స్థానిక సమస్యలపై ధర్నా జరుగుతుందని, అక్కడకి ఎవ్వరినీ రానివ్వటం లేదని దాంతో జగన్ సభకూడా రద్దయిందని పెద్దఎత్తున ప్రచారం చేసారు. అంతేకాదు.. డల్లాస్ లోని ఆ ఆడిటోరియం వద్దకు వెళ్తే ఇబ్బందులు పడతారని కొంతమంది ప్రజలని తప్పుదోవ పట్టించటానికి సోషల్ మీడియా ద్వారా కూడా విష ప్రచారం చేసారు.

అయినా స్థానిక తెలుగు ప్రజలు ఇవేవీ పట్టించుకోకుండా అంచనాలకి మించి హాజరయ్యారు. అలాగే సభ పెద్దఎత్తున సక్సెస్ అవడంతో టీడీపీ ఎన్నారైలు చేసిన ప్లాన్లు మొత్తం అట్టర్ ఫ్లాప్ అయ్యాయని వైసీపీ ఎన్నారైలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లీష్ పేపర్లు మొత్తం అమెరికాలో నరేంద్రమోడీ తరువాత ఒక భారత రాజకీయ నాయకుడికి ఇంత పెద్దఎత్తున జనం రావటం ఇదే మొదటిసారని, సీఎం ప్రసంగం అద్భుతంగా సాగిందని, ప్రజల స్పందన అపూర్వంగా ఉందని ఆర్టికల్స్ వ్రాసారు.. కానీ కొందరు టీడీపీ శ్రేణులు మాత్రం జనం రాలేదని, స్టేజి వెనుకవైపు ఫొటోలతో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అసలు ఎవడైనా కార్యక్రమానికి వెళ్లినపుడు స్టేజి వెనుక కూర్చుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకే మీకు 23 సీట్లు ఇచ్చారని ఇకనైనా తప్పుడు ప్రచారాల్ని మానుకోవాలని కోరుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat