ఏపీలో కొత్తగా ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టబోతున్నారు. ఏపీలో అర్హత ఉన్న 1.44 కోట్ల కుటుంబాలకు ఈ కొత్త కార్డులను ఇస్తారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు డిసెంబరు 21 నుంచి వీటిని పంపిణీ చేస్తారు. వార్షికాదాయం రూ.5 లక్షలున్న కుటుంబాలనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురానున్నారు. వెయ్యి రూపాయల వ్యయం దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు పొందే విధానాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. జనవరి నుంచి రెండు మూడు నెలలు దీన్ని పరిశీలించనున్నారు. ఫలితాలను బట్టి మిగిలిన జిల్లాలకూ క్రమంగా విస్తరిస్తారు. అర్హులందరికీ తొలుత క్యూఆర్ కోడ్ ఉండే స్మార్టుకార్డు ఇస్తారు. వైద్యసేవల కోసం ఆ కార్డుతో ఆసుపత్రుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రోగులు పొందిన వైద్య చికిత్సల వివరాలను కార్డులో పొందుపరుస్తారు. ఇతర రాష్ట్రాలలో కూడా వైద్యం చేసుకునే సదుపాయం కల్పిస్తారు.