వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తూ మరోసారి లోకేశ్ అండ్ టీం అడ్డంగా దొరికిపోయింది. తాజాగా ఆర్టీసీ టికెట్ల వెనుకభాగంలో క్రైస్తవ, ముస్లిం మతాలకు చెందిన పవిత్ర స్థలాలకు ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో 39 కోట్లు కేటాయించారని ప్రచారం చేస్తున్న ముద్రణలు కనిపించాయి. దీంతో ముందూ వెనుక ఆలోచించుకోకుండా లోకేశ్ టీం జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు సిద్ధమయ్యారు. వెంటనే జగన్ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ప్రచారం ప్రారంభించారు.
అయితే ఇదంతా జరిగింది చంద్రబాబు హయాంలోనేనని అర్ధమవడంతో లోకేశ్ అండ్ టీం కంగుతిన్నారు. విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి 80 కోట్లు కేవలం కేటాయించి వదిలేసింది చంద్రబాబు హయాంలోనే అందుకు సాక్ష్యం కూడా బయటకు వచ్చింది. May 13, 2018 @ncbn paid foundation stone for haj house at vijayawada with a budget estimate of 80 crores. అంటూ ఆ ఆర్టికల్ చూస్తేనే అర్ధం అయిపోతుంది, ఈ “టికెట్ controversy” టీడీపీ టైములో జరిగిన నిర్వాకమే అని.. అయినా లోకేష్ కి పనిలేకుండా సోషల్ మీడియా టీం తో ఫేక్ ట్వీట్లు వేయడం డిలీట్ చేసి పరువు పోగొట్టుకోవడం తరచుగా జరుగుతూనే ఉంది.