రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుదిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తొలి దశలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించింది. దీనికోసం బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి రాష్ట్రంలో బెల్టుషాపులు లేకుండా చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖాధికారులను ఆదేశించింది. జిల్లాలవారీగా ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమై చర్యలు ప్రారంభించారు. వాస్తవానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలుచేసే దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పింఛను పథకాన్ని పెంచుతూ సంతకం పెట్టారు. తర్వాత మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్ఆర్ అక్షయపాత్రగా నామకరణం చేసి అక్కడ పనిచేస్తున్న వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా అన్ని కార్యక్రమాలను చేస్తూనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు దిశగా తొలి అడుగు వేశారు. అన్ని బెల్ట షాపులను తొలగించాలని జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు తొలి విడుతలో బెల్ట్ షాపులను ఎత్తేయాలని సూచించారు. బెల్ట్ షాపులను ఎత్తేయడం వల్ల ఎంత ఆదాయం తగ్గుతుందో అంచనా వేసి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. బెల్టు షాపుల నిరోధానికి పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ఇదేక్రమంలో మరో అడుగు ముందుకువేసి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అలిపిరి మెట్ల మార్గం దాకా గడచిన టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిన ప్రతీ మద్యం షాపులను రద్దు చేసారు. శ్రీవారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండలని ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జగన్ హిందువు కాదని దుష్ప్రచారం చేస్తున్నవారంతా దీనికి సమాధానం చెప్పాలని వైసీపీ కోరుతోంది.
Home / ANDHRAPRADESH / జగన్ హిందువు కాదు.. దైవభక్తి లేదని వాదించే వారంతా కచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్
Tags ap jagan politics prohibition nd excise department tirupathi wine shops ysrcp