ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరి కోవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కమలనాథుల్లో చర్చ జరుగుతోంది. గత మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి మనీ ల్యాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నాడు. చంద్రబాబుకు మోదీతో విబేధాల నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కానీ రాజ్యసభ ఎంపీగా కొనసాగాడు. అయితే ఏపీలో టీడీపీ ఘోర పరాజయం తర్వాత కేసుల భయంతోనో, తన రాజకీయ భవిష్యత్తు కోసమో టీడీపీ రాజ్యసభపక్షాన్ని బీజేపీలో విలీనం చేయించి కాషాయకండువా కప్పుకున్నాడు. బీజేపీలో చేరినా… సుజనాకు చంద్రబాబుతో, టీడీపీ నేతలతో చీకటి బంధం కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురైన నేపథ్యంలో సుజనా వైసీపీ ప్రభుత్వం కావాలనే కుట్ర చేసిందని ఆరోపించాడు. ఇక రాజధానిని వైసీపీ ప్రభుత్వం అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునేది లేదంటూ…టీడీపీ పాటనే పాడుతున్నారు.
జీవీయల్, సోమువీర్రాజు వంటి నేతలు బాబు హయాంలో అమరావతిలో ఇన్సైడర్ జరిగిందని, భారీ అవినీతి చోటు చేసుకుందని విమర్శలు చేస్తుంటే..సుజనా మాత్రం రాజధాని అంశంలో రైతులను రెచ్చగొడుతున్నాడు. అమరావతిలో టీడీపీ నేతలు బినామీల పేరుతో వేలాది ఎకరాలు కొల్లగొట్టేసారని మంత్రి బొత్స ఆరోపిస్తే..నా పేరు మీద ఒక్క సెంటు భూమి ఉన్నా…చూపించండి అంటూ సుజనా ఛాలెంజ్ విసిరాడు. దీంతో బినామీల పేరుతో సుజనా 128 ఎకరాలు కొల్లగొట్టాడంటూ ఓ లిస్ట్ బయటపెట్టారు బొత్స. అయితే సుజనా చౌదరి బినామిల పేరుమీద మొత్తం 623 ఎకరాల భూమి ఉందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో బొత్స ఆధారాలపై స్పందిస్తే తన బినామీ వ్యవహారాలు బయటపడతాయని భయపడిన సుజనా సైలెంట్ అయ్యాడు. అయితే అమరావతిలో పర్యటిస్తూ రైతులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే పనిలో మాత్రం సుజనా బిజీగా ఉన్నాడు.
తాజాగా రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి పర్యటనలో అంతా తెలుగుదేశం పార్టీ వాళ్లే కనిపించారని స్థానికులు చెబుతున్నారు. వాళ్లంతా పచ్చకండువాలు తీసి కాషాయ కండువాలు వేసుకుని వచ్చారని తెలుస్తోంది. కాషాయ కార్యకర్తల్లా నటించిన టీడీపీ కార్యకర్తలు సుజనా వెంట నడిచి.. రైతుల దగ్గర కాసేపు డ్రామాను రక్తి కట్టించారని తెలుస్తోంది. అంతే కాదు సుజనా చుట్టూ స్థానిక బీజేపీ నేతల కంటే…టీడీపీ నేతలే ఉన్నట్లు సమాచారం. మొత్తంగా సుజనా టీడీపీ ఆఫీసు నుంచి వస్తున్న స్క్రిప్ట్నే చదువుతున్నారని, టీడీపీ నేతల ఎజెండానే సుజనా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఆఖరికి బీజేపీ తరపున నిర్వహించే కార్యక్రమాల్లో కూడా టీడీపీ కార్యకర్తలే కాషాయ కండువాలు వేసుకుని సుజనా వెంట తిరగడం చూసి..స్థానిక బీజేపీ నేతలు షాక్ తింటున్నారు. బీజేపీలో ఉండి ఫక్తు టీడీపీ నేతలా వ్యవహరిస్తున్న సుజనాను చూసి అమ్మ సుజనా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.