ఈఎస్ఎల్ నరసింహాన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి నవ్యాంధ్ర,తెలంగాణ వరకు అత్యధిక కాలం గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అని. అయితే ఆయన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ క్రమంలో నరసింహాన్ రాజకీయాల్లోకి వెళ్తారు.
లేదు ఆయన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తనపై వస్తోన్న వార్తలపై గవర్నర్ క్లారీటీ ఇచ్చారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ గిరి తర్వాత పోలీటికల్ ఎంట్రీ ఇస్తానని వార్తలు వస్తున్నాయి. నా పదవీ కాలం అయిన తర్వాత నేను ఏ రాజకీయ పార్టీలోకి నేను వెళ్లను. మిగిలిన జీవితాన్ని అంతా కుటుంబంతో గడుపుతా అని ఆయన క్లారీటీచ్చారు.