తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే రాష్ట్ర నూతన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతంగిరి నియామకపత్రం అందజేశారు. చెన్నైలోని ఆమె నివాసంలో అపాయింట్ మెంట్ లెటర్ ను అందించారు. ఈ సందర్భంగా కొత్త గవర్నర్ కు వేదాంతంగిరి శుభాకాంక్షలు తెలిపారు. అటు తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు దక్కడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈనెల 8వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తున్నట్టు చెప్పారు.