Home / 18+ / రోజురోజుకి దిగజారిపోతున్న బిగ్ బాస్…ది రియాలిటీ షో

రోజురోజుకి దిగజారిపోతున్న బిగ్ బాస్…ది రియాలిటీ షో

బిగ్ బాస్ రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ లోకి అడుగు పెట్టిన  విషయం విధితమే. దీనికి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ పెద్ద మజా లేదనే చెప్పాలి. హౌస్ మేట్స్ అందరూ ఎప్పుడూ చూసినా సేఫ్ గేమ్ ఆడడానికే చూస్తున్నారు. దీంతో షో నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా యాంకర్ శిల్ప చక్రవర్తిని లోనికి పంపారు. ఈ షో మొత్తంలో హౌస్ లో అందరు గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది బాబా భాస్కర్ మాస్టర్ నే. అలాంటిది యాంకర్ శిల్ప వస్తూ వస్తూనే ఆయనతో గొడవ పెట్టుకుంది.

 

ఇక నిన్నటి ఎపిసోడ్ లో దొంగతనం జరిగింది. ఇందులో దొంగలుగా వరుణ్, రాహుల్, రవి, పునర్నవి, శివజ్యోతి ఉన్నారు. అయితే ఈ దొంగలకు పెద్దగా అంటే రాణిగా శిల్పాని ఎన్నుకున్నారు. ఇక సాదారణ ప్రజలుగా శ్రీముఖి,హిమజ, వితిక, బాబా భాస్కర్, మహేష్, అలీలను ఎన్నిక చేసారు. అసలు రగడ ఇప్పుడే మొదలైంది. ఈ టాస్క్ మొదలైన సమయం నుండి ఒకరినొకరు తోసుకోవడం, తిట్టుకోవడం ఇలా రచ్చ రచ్చ జరుగుతుంది. చూసే ప్రేక్షకులకి వీరు ఇంతగా దిగాజారిపోయరా అని అనిపించేట్టుగా చేస్తున్నారు. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat