తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని సుమారు పద్దెనిమి లక్షల ఎకరాలకు తొలిదశలో సాగునీరు ఇవ్వనున్నారు. అయితే ఒకపక్క రైతన్నల కలలను నిజంచేస్తూనే మరోవైపు ఇసుకలో కూడా కాళేశ్వరం కాసులపంట కురిపించింది.
అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ,అన్నారం బ్యారేజీల వద్ద ఉన్న ఇసుకను విక్రయించడంతో ఇప్పటిదాక రూ.1,231.55కోట్ల ఆదాయం వచ్చింది. అంతేకాకుండా ఇంకా రూ.2వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో అధికారులు సర్వే నిర్వహించి మేడిగడ్డ బ్యారేజీ వద్ద 4.18కోట్ల క్యూబిక్ మీటర్లు,అన్నారం బ్యారేజీ వద్ద 1.26కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు సమాచారం..