యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా మరియు భారీ బడ్జెట్ కావడంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కాని అంచనాలకు తగ్గట్టుగా మాత్రం సినిమా లేదనే చెప్పాలి. రిలీజ్ నాడు సాయంత్రం రివ్యూస్ పరంగా నెగటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.అయితే దీనిపై కాలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభూ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేసాడు. తాను ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు చూస్తే సాహో ఫ్లాప్ అయినందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది. దీనిపై ధీటుగా స్పందించారు ప్రభాస్ ఫాన్స్. అంతేకాకుండా సరైన గుణపాటం కూడా చెప్పారు.