ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో ఊరట లభించినట్టే. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా మరియు భారీ బడ్జెట్ కావడంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కాని అంచనాలకు తగ్గట్టుగా మాత్రం సినిమా లేదనే చెప్పాలి. డైరెక్టర్ సుజీత్ హాలీవుడ్ రేంజ్ లో చిత్రం తీసినప్పటికీ ఎక్కడో లోపం ఉంది. కాని కలెక్షన్లు పరంగా మాత్రం సాహో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 350కోట్లు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇదే ఊపూ కొనసాగితే 500 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుంది అనడంలో సందేహమే లేదు.