Home / ANDHRAPRADESH / ఆ ఎగ్జామ్ రాసిన వారికి 15 వెయిటేజీ మార్కులు…ఏపీ పంచాయతీరాజ్ శాఖ…!

ఆ ఎగ్జామ్ రాసిన వారికి 15 వెయిటేజీ మార్కులు…ఏపీ పంచాయతీరాజ్ శాఖ…!

గ్రామ సచివాలయం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా గ్రామసచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షల్లో డేటా ఆపరేటర్లకు 15మార్కుల వెయిటేజీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే ఏపీ పంచాయతీరాజ్‌శాఖలో డీపీఓ, డీపీఆర్సీలో ఈ-గవర్నెన్స్‌ కింద ఏడేళ్ల నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టుల రాతపరీక్షల్లో 15మార్కులు వెయిటేజీ కల్పించేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆర్నెల్లకూ 1.5మార్కులు చొప్పున గరిష్టంగా 15మార్కులు రాతపరీక్షల్లో వచ్చిన మార్కులకు కలుపుతామన్నారు. దీంతో డేటా ఆపరేటర్లలో ఆనందం వ్యక్తం అవుతోంది.గత ఏడేళ్లుగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు పని చేస్తున్న తమను గుర్తించి 15 వెయిటేజీ మార్కులు ప్రకటించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat