తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను బదిలీ చేసి తమిళ సై సౌందర రాజన్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈఎస్ఎల్ నరసింహాన్ తన పదవీ బాధ్యతలు నుండి ఈ నెల పదో తారీఖున నుంచి తప్పుకోనున్నారు. అయితే ఈఎస్ఎల్ నరసింహాన్ కు ఈనెల ఏడో తారీఖున వీడ్కోలు సభను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఇతర ప్రభుత్వ ఉన్నత అధికారులు హజరు కానున్నారు.