ఇదేమన్నా ఎస్ ఎస్ రాజమౌళి మూవీనా… పాకిస్థాన్ ను దోమ గడగడలాడించడానికి.. అయిన మీరే ఏదో కావాలని రాస్తోన్నారని అనుకుంటున్నారా.. అవన్నీ కాదు దోమ పాకిస్థాన్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టింది. అసలు విషయం ఏమిటంటే పాకిస్థాన్ అణ్వయుధాలను ,అణుబాంబులను తయారుచేస్తుందని భారత్ తో పాటు యావత్తు ప్రపంచదేశాలు ఆరోపిస్తున్న సంగతి విదితమే.
ఈ క్రమంలో కరాచీలో హాకిస్ బేలో ఉన్న అణుకేంద్రంలో చైనాకు చెందిన రెండు వందలమందికి పైగా శాస్త్రవేత్తలు,ఇంజినీర్లు పని చేస్తున్నారు. అయితే దోమలు కుట్టడం వలన వైరల్ ఫీవర్లు.. డెంగీ జ్వరాలు వచ్చాయి. దీంతో ఆసుపత్రిలో చేర్చిన తర్వాత డాక్టర్లు హెక్త్ రీపోర్టు ఇవ్వడంతో ఈ ఇష్యూ బయటకొచ్చింది. దీంతో కేవలం దోమ పాకిస్థాన్ కుట్రను బయట పెట్టింది అన్నమాట.