తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన ముప్పై రోజుల పంచాయతీల అభివృద్ధిపై ప్రణాళిక గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల ప్రగతికై ముప్పై రోజుల ప్రణాళికను ప్రవేశ పెట్టారు.
ఎన్నో దశాబ్ధాల నుండి పెండింగ్లో ఉన్న తండాలను,గూడెలను పంచాయతీలుగా చేశారు. గ్రామాలు,పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. బంగారు తెలంగాణ అవుతుంది. అందుకే జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజల దగ్గర నుండి సర్పంచ్ ల వరకు అందరూ నిబద్ధతతో పని చేసి గ్రామాలను,పల్లెలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పరిశుభ్రత,పచ్చదనంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.