కొత్త మంత్రుల ప్రమాణస్వీకారంతో తెలంగాణ భవన్ లో సంబురాలు మిన్నంటాయి. పటాకుల మోతలు, డప్పు చప్పుళ్లతో తెలంగాణ భవన్ హోరెత్తింది. టీఆర్ఎస్ క్యాడర్ భారీగా తరలివచ్చి సందడి చేశారు. గులాబీ బ్యానర్లతో విజయనాదం చేశారు. తీన్మార్ డ్యాన్సులతో ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. మహిళా కార్యకర్తల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా.. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా ప్రమాణం చేశారు.