స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టర్ ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్రం డేంజర్ జోన్ లో పడింది. స్టొరీ మొత్తం లీక్ అయ్యింది. దీంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతున్నారట. ఇక లీక్ అయిన స్టొరీ విషయానికి వస్తే అల్లు అర్జున్ బాగా డబ్బున్న ఫ్యామిలీ ఐన జయరామ్, టబు కొడకు. ఇక సుశాంత్ డ్రైవర్ మురళీ శర్మ కొడుకు. ఈ చిత్రం జయరామ్, మురళీ కృష్ణ మధ్య ఒక వాదనతో మొదలవుతుంది. ఇందులో మురళీ కృష్ణ .. డ్రైవర్ కొడకు డ్రైవర్ నే అవుతాడు అని చెప్పగా.. జయరామ్ జననం బట్టి మనిషి తయారవ్వడు తన ఆలోచనలు బట్టి తయారవుతారు అని అంటాడు. ఆ తరువాత రెండు కుటుంబాలు వైకుంఠపురంలో అడుగుపెడతారు. ఈ మధ్యలో నవదీప్ విలన్ గా ఎంట్రీ ఇస్తాడు. ఇక స్టొరీ మొత్తం నవదీప్ మరియు ఆ ఊరు చుట్టూనే కొన్ని ట్విస్ట్ లతో ఉంటుంది.