యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలో 2011లో నువ్విలా చిత్రంతో అరంగ్రేట్రం చేసాడు. అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే మంచి పేరు తెచ్చుకొని ఫుల్ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తానూ చివరిగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్, ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. తాజాగా ముంబైలోని కబీర్ సింగ్ హీరోయిన్ కైరా అద్వానీని కలిసాడు విజయ్. కబీర్ సింగ్ విజయ్ దేవరకొండ సినిమా అర్జున్ రెడ్డి రీమేక్. ఇందులో కైరా, సాహిద్ కపూర్ నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. ఇక కైరా విషయానికి వస్తే ఆమె తీసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అని చెప్పాలి. అయితే ముంబై లో కలిసిన వీరిద్దరూ ఫోటోలు కు మంచిగా స్టిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా దీనిపై కామెంట్స్ కూడా గట్టిగా వస్తున్నాయి. మొన్నటివరకు విజయ్, రష్మిక పై వచ్చిన పుకారు ఇప్పుడు వీరిపై వస్తుందని సమాచారం.