బాబా రాందేవ్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఉదంతం మరోసారి చర్చకు వచ్చింది. చంద్రబాబుది విషకౌగిలి అంటూ ఆయన వాడకం వల్లే అలా జరిగిందట.. ఆంధ్రప్రదేశ్ నుండి ఎర్రచందనం అక్రమంగా తరలించిన వారిలో రాందేవ్ బాబా కూడా ఒకరని సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఆధారాలతో సహా వినిపిస్తున్నాయి. ఆయన కొన్నది కొంచెమైనా ఎర్రచందనం ఎక్స్ పోర్ట్ చేసింది ఎక్కువట.. దీనిపై ఢిల్లీలో కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. 2014లో నిర్వహించిన వేలంలో కూడా ఎక్కువగా ఎగుమతి చేసింది రాందేవ్ బాబానే అట..
గతంలో ఈయన 706 టన్నుల ఎర్ర చందనాన్ని కేవలం రూ. 207 కోట్లకి కొనడంతో ఇక్కడే వివాదం మొదలైంది. బాబా కొన్నదానికి అమ్మినదానికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో డీఆర్ఐ వాళ్ళు కేసుపెట్టారు. దాదాపుగా 3వేల టన్నులు లెక్కతేలట్లేదనేది గతంలో ఆయనపై వచ్చిన అభియోగం.. గతంలో అన్ని మీడియాల్లోనూ ఈ వార్త వచ్చింది. ఇదంతా బాబా రాందేవ్ లాంటి వారిద్వారా తరలించారనేది DRIఅనుమానం. అయితే చంద్రబాబు స్వయంగా చైనా వెళ్ళి ఎర్రచందనం అమ్ముతామంటూ ఎన్నోసార్లు చెప్పారు. అలాగా 3సార్లు చైనా వెళ్లినా ఎంత అమ్మారో ఎవరికి అమ్మారో ఈరోజు వరకూ చంద్రబాబు చెప్పలేదు. గతంలో రాందేవ్ బాబా హవా నడుస్తున్న సమయంలో హర్యానా ప్రభుత్వం ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టి కాబినెట్ హోదా కూడా కల్పించింది.
అప్పుడే ఈ ఎర్రచందనం కేసు బాగా సీరియస్ అవడంతో మోడీ కూడా వీరిని దూరం పెట్టారట. 2014నుండి సన్నిహితంగా ఉన్న బాబా, మోడీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అప్పటినుంచి పతాంజలి పతనం మొదలై దివాళా తీసింది. అందుకే 2014నుండి 2017వరకు చంద్రబాబు, రాం దేవ్ బాబా తరచూ కలిసేవాళ్ళు కానీ ఆతరవాత అస్సలు కలవలేదు. అలాగే బాలయ్య కూడా పతంజలికి C&F agency గా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు చూపు పడిన తర్వాత బాబా, ఆయన కౌగిలితో పతంజలి పతనం అయ్యిందని చెప్పుకుంటున్నారు. తన రాజకీయ, ధన స్వార్ధంకోసం వాడుకుని జీవితాలను బలిచేసిన వారిలో బాబా రాం దేవ్ కూడా ఉన్నారట.