అక్కినేని అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న నాలుగు స్థంబాల్లో ఒకటని తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకు తెల్సిన విషయం..
అలాంటి కుటుంబానికి చెందిన హీరో పక్కన అవకాశమంటే ఎవరైన ఎగిరి గంతేస్తారు.కానీ పూజా మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మూవీ చిత్రీకరణ దశలో ఉన్న సంగతి విధితమే.
ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే అందుకు ఆమె అంగీకరించలేదంట. దానికి కారణం అమ్మడు అడిగినంత రెమ్యూనేషన్ ఇవ్వడానికి చిత్ర నిర్మాత నో చెప్పడం అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి.