గత తెలుగుదేశం 5ఏళ్ళ పాలనలో ఎక్కడ చూసినా హత్యలు, హాహాకారాలతో భయం గుప్పెట్లో సామాన్య ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. తెలుగు జాతి చరిత్ర పుటలను రక్తపు మరకలతో మలినం చేసిన చంద్రబాబు పాలనలో ఆంద్రప్రదేశ్ భీకర దుర్ఘటనలతో చిగురుటాకులా వణికిపోయింది. ఎటు చూసినా రౌడీలు, గూండాలు, కబ్జాదారుల ఆగడాలకు అడ్డులేకుండా పొయిన రోజులవి.. గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల అండతో బహిరంగ బెదిరింపులు, వినకపొతే దాడులతో పేట్రేగిపోయారు. ఇది కచ్చితంగా చంద్రబాబు మార్క్ పాలన అనే చెప్పుకోవాలి..
టీడీపీ చేసిన రాజకీయ హత్యలివే:
(2014 ఏప్రిల్ 14) గుంటూరు : తెనాలిలో వైసీపీ యూత్ వింగ్ లీడర్ మెడిశెట్టి కృష్ణ హత్య
(2014 సెప్టెంబర్ 11) గుంటూరు : చినగార్లపాడులో వైసీపీ కార్యకర్త గోవింద్ రెడ్డి హత్య
(2014 అక్టొబర్ 28) విజయవాడ : నందిగామలో వైసీపీనేత బొగ్గవరపు వాసు హత్య
(2014 నవంబర్ 27) కర్నూల్ : పలుకూరులో వైసీపీ నేత ప్రభాకర్ నాయుడు హత్య
(2014 డిసెంబర్ 30) నెల్లూర్ : వైసీపీ నేత అల్లం నరేంద్ర హత్య
(2015 మార్చ్ 31) అనంతపురం : కిష్టిపాడులో వైసీపీ నేత (కోపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్) విజయ భాస్కర్ రెడ్డి హత్య.
(2015 ఏప్రిల్ 29) అనంతపురం : రాప్తాడు లొ వైసీపీ నేత ప్రసాద్ రెడ్డి (ఎమ్మార్వో ఆఫీస్ లో) హత్య.
(2015 మే 15) కర్నూల్ : వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ వసంత రావు హత్య.
(2015 అక్టోబర్ 14) ఆళ్ళగడ్డ : చింతకుంటలో వైసీపీ నేత రాఘవ రెడ్డి హత్య.
గుంటురు : పల్నాడు వైసీపీ నేత కుమారుడు సాంబయ్య హత్య.
(2016 డిసెంబర్ 9) పులివెందుల : వేంపల్లి మండలం ఉపాద్యక్షుడు గజ్జెల రామిరెడ్డి హత్య.
(2017 మే 6) కర్నూల్ : గోవిందపల్లిలో వైసీపీ నేత ఇందూరి ప్రభాకర్ రెడ్డి ఆయన బావమరిది దారుణ హత్య.
(2017 మే 21) కర్నూల్ : పత్తికొండ వైసీపీ ఇన్చార్జ్ చెరుకుపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు, డ్రైవర్ ఎల్లప్ప దారుణ హత్య
(2017 జూన్ 16) వై.యస్.ఆర్ జిల్లా వెంపల్లి మండలం కుప్పాలపల్లె కు చెందిన వై.సి.పి నేత బంకా నాగ భూషణ రెడ్డి తెలుగుదేశం వర్గీయులు కాపుకాసి దారుణ హత్య
(2017 – డిసెంబర్ – 6) అనంతపురం జిల్లా ధర్మవరం మండలం లొని బండపల్లి గ్రామానికి చెందిన వై.సి.పి నాయకులు చెన్నా రెడ్డి దారుణ హత్య
(2018 – మార్చ్ – 30) అనంతపురం జిల్లా రాప్తాడులో కందుకూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు శివారెడ్డిని దారుణహత్య (హత్యకేసులొ ప్రధాన నిందితుడు బాలకృష్ణ పరిటాల శ్రీరాం సన్నిహితుడు)
(2018 – జులై – 9) వై.యస్.ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దికుంట గ్రామానికి చెందిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ నాయకులు రంగమేశ్వర రెడ్డి దారుణ హత్య.
ఇవే కాక గడిచిన ఐదేళ్లలో ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది నాయకుల హత్యలు జరిగాయి. చివరికి ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. టీడీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా సాగిన హత్యల పరంపరతో రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా పడిపోయాయి. చాలామంది వీరి దుర్మార్గాలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడి తనువు చాలించిన ఘటనలూ ఉన్నాయి.