తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పట్టణీకరణ జరుగుతుంది సీఈడీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం మూడున్నర కోట్లు. ఇందులో పట్టణాల్లో నివసించే వారి సంఖ్య మొత్తం 1.36 కోట్లుగా ఆ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణ జనాభా మొత్తం నలబై శాతం దాటుతుందని తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న పలు సంస్కరణలతో పాటుగా పరిపాలన వికేంద్రీకరణ జరగడం అని ఆ నివేదిక ప్రకటించింది.
అయితే రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వలసలు గణనీయంగా తగ్గాయి. మొత్తం మూడు వందల అరవై డిగ్రీల కోణంలో నగరాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నది.