ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థల నియామక చట్టంలో పలు మార్పులు చేసింది. ప్రతీ దేవాలయ ట్రస్టుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులను మినహాయించి 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయా దేవాలయాల పాలకమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది.
మొత్తం ఉన్న నామినేటెడ్ సభ్యుల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేస్తూ సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం భర్తీచేసే నామినేటెడ్ పదవులు (కార్పొరేషన్లు, వివిధ ట్రస్ట్ బోర్డులు, వ్యవసాయ మార్కెట్లు), కాంట్రాక్టుల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని కేబినెట్లో కూడా తీర్మానించింది. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.