పరిశ్రమలు, ఐటీ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ ఐఐసీ చేపట్టిన ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, సిరిసిల్ల అపారెల్ పార్క్లతో పాటు ఇండస్ట్రియల్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల పురోగతిపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పారిశ్రామిక పార్కుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సాధ్యమైనన్ని పెట్టుబడులు తేవాలని అధికారులకు సూచించారు. రానున్న నాలుగేళ్ల కాలానికి అవసరమైన కార్యాచరణపై విభాగాల వారీగా నివేదిక ఇవ్వాలి. రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు పలు రంగాల కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. వచ్చే నెలలో పలు భారీ పెట్టుబడులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఐటీలో భారీ పెట్టుబడులు రానున్నాయి. పలు కంపెనీలు ఇప్పటికే టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు అందుకున్నాయి. అక్టోబర్ నెలలో వాటికి శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న కంపెనీలకు పూర్తి సహకారం అందించాలి. రాష్ర్టానికి ఎన్ని ఎక్కువ పెట్టుబడులు వస్తే అన్ని ఉద్యోగవకాశాలు వస్తాయి. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుబడులు వచ్చేలా ఉండాలని’ కేటీఆర్ అధికారులను కోరారు.
Minister @KTRTRS held a review meeting with the HoDs of ITE&C and Industries departments in Hyderabad today. Prl Secy @jayesh_ranjan and other senior officials participated in the meeting. pic.twitter.com/yah9WMIHkv
— Min IT, Telangana (@MinIT_Telangana) September 13, 2019