కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ చేశారు. ఈ రోజు జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం హిమ్మత్రావు పేటలో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ.. కాళేశ్వర ప్రాజెక్టు చరిత్రలో అద్భుత నిర్మాణమనీ, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఎంపీ బండి సంజయ్కి చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడాలని మంత్రి ఎర్రబెల్లి సవాల్ చేశారు. వృద్ధాప్య పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఇస్తోందన్నారు. ఇటీవలి కాలంలో పనిలేని వారు రాజకీయాలు చేయడం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. చీటికి మాటికి ధర్నాలకు కూర్చుంటున్నారని ఇది సరికాదని హితవు పలికారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రోల్ మోడల్గా నిలిచిందన్నారు.