నాలుగో తరగతి పిల్లలు అంటే ఆ వయసులో తల్లిదండ్రుల సంరక్షణలో ఉండడం.. స్నేహితులతో ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు కానీ ఓ నాలుగో తరగతి పాప ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాసింది.. లేఖ చదివిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు.. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురానికి చెందిన కోడేరు పుష్ప అనే ఓ బాలిక ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసింది.. తనకు చెల్లెలు గాయత్రి తమ్ముడు హేమంత్ ఉన్నారని, తండ్రిపేరు రాజు తల్లి పేరు జానకి అని పేర్కొంది.. వీరి కుటుంబం ఇబ్బందులు ఉన్నందున ఈ లేఖ రాస్తున్నానని తెలిపింది. తమ ఊరినుంచి తనతో చదువుకున్న పిల్లలు ఎవరూ తనతో మాట్లాడటం లేదని, ఎవరైనా తమతో మాట్లాడితే 10 వేలు జరిమానా వేస్తారు అని ఆమె చెప్పింది..
ఊర్లో వెలివేసారని అందులో పేర్కొంది.. అయితే తన నాన్నను చంపేస్తారని తన ఫ్రెండ్స్ చెప్తున్నారంటూ ఆపాప జగన్ రాసిన లెటర్ లో స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ లెటర్ తో పాటు ఇతర వివరాలు, ఫోన్ నెంబరు మొత్తం ఇచ్చింది.. అసలు విషయంలోకి వెళితే వివాదం ఈ కారణంగా రామచంద్రపురంలో గొడవ జరిగింది. ఇదే విషయంపై అనేకసార్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసారట.. ఫలితం లేకపోవడంతో లేఖ రాసారని తెలిసింది. ఈవార్త రావడం చూసి జగన్ చలించిపోయారు.. వెంటనే ప్రకాశం జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి మరీ వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించాలని పూర్తిగా వివరాలు తెలుసుకోవాలని, వెంటనే ఈసమస్యకు పరిష్కారం తెలపాలని జగన్ ఆదేశించారు. జగన్ ఈ విషయంపై స్పందించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు.