తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సభ ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో వివాదమైన నల్లమల అడవిలోని యూరేనియం తవ్వకాలపై అనుమతుల గురించి చర్చ జరుగుతుంది.
ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరికి నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలపై అనుమతులివ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇవ్వం అని తేల్చి చెప్పారు.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని తవ్వకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే కలిసి పోరాడుతాం”అని ఆయన స్పష్టం చేశారు.ఆయన ఇంకా మాట్లాడుతూ” మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తారు. నేను అమెరికాకు వెళ్ళిపోతాను అని బయట ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అవాస్తవాలు. మరో పదేళ్ళు మాదే అధికారం. అప్పుడు నేనే ముఖ్యమంత్రి.. ఇప్పుడు నాకు అరవై ఆరు. మరో పదేళ్లు చేయలేనా” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.