ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.. కొద్ది రోజులుగా తీవ్ర వివాదాల్లో ఉన్న నేపథ్యంలో ఆయన సూసైడ్ చేసుకున్నారని తెలుస్తోంది. హైదరాబాద్లోని తన నివాసంలో కోడెల ఉరి వేసుకుని ఉన్నట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి ఆయనను బసవతారకం ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు వైద్యులు ప్రస్తుతానికి కోడెలకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కోడెల ఫర్నిచర్ వివాదంలో ఇరుక్కున్నారు. దాని తర్వాత కేట్యాక్స్ వ్యవహారాల్లో ఆయన పేరు భాగా వినిపించింది. ఆయనపై ఎన్నో కేసులు కూడా నమోదు అవుతూ వస్తున్నాయి. గతంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోక పోవడంతో నరసరావుపేటలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చిన ఆత్మహత్య చేసుకోవడం తెలుగుదేశం పార్టీ శ్రేణులను కలచివేస్తోంది.